ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎగుమతుల్లో భారత్ చరిత్ర సృష్టించింది: ప్రధాని నరేంద్ర మోడీ

national |  Suryaa Desk  | Published : Wed, Jun 01, 2022, 03:39 AM

ఎగుమతుల్లో భారత్ చరిత్ర సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత స్టార్టప్‌లపై చర్చ జరుగుతోందని మోదీ తెలిపారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడమే తమ ధ్యేయమని చెప్పిన మోదీ.. సర్జికల్‌ స్ట్రైక్‌ చేయడం పట్ల గర్వపడుతున్నామని అన్నారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ‘పేదలకు అన్యాయం జరగొద్దు. వారి పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలి. యువత స్వయం సమృద్ధి కోసం ముద్ర రుణాలను అందించాం’ అని ప్రధాని చెప్పారు.


నయా భారత్‌ కోసమే సంస్కరణలు చేపట్టామని, ఓటు బ్యాంకు కోసం కాదని ప్రధాని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉండాల్సిందేనని మోదీ అన్నారు. దీనివల్ల అవినీతి తగ్గి ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. దీంతోపాటు శాశ్వత సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్‌ లో కిసాన్‌ సమ్మాన్‌ నిధి లబ్ధిదారులను ఉద్దేశించి ప్రధాని మోదీ.. సిమ్లా నుంచి వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు.


ఎన్ని అవాంతరాలెదురైనా దేశ ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించామని ప్రధాని తెలిపారు. సుదూర ప్రాంతాల్లోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించి 200 కోట్ల డోసులను పంపిణీ చేశామని మోదీ చెప్పారు. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa