వారసత్వం ఒక్కటే పరమావధి కాదని, కష్టపడి పనిచేసే తత్వం ఉన్న వాళ్లకే అవకాశం దక్కుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. అలా పార్టీ పగ్గాలు స్వీకరించే అవకాశం లోకేశ్తో పాటు పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉంటుందని చెప్పారు. అదే సమయంలో తరాలు మారుతున్న కొద్దీ నేతల్లో సత్తా తగ్గిపోతోందని కూడా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ తరంలో ఎక్కువ మందిలో సత్తా ఉంటే తర్వాతి తరంలో సత్తా కలిగిన నేతలు తగ్గిపోయారని, ఆ తర్వాతి తరంలో అది మరింతగా తగ్గిపోతోందని చంద్రబాబు పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకునే దిశగా టీడీపీ పోరాటం చేస్తోందన్న చంద్రబాబు, ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా సాగుతున్నామని చెప్పారు. ఈ దిశగా పొత్తులపై స్పందించిన చంద్రబాబు పొత్తు అనేది రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరినప్పుడే సాధ్యపడుతుందని చెప్పారు. ఈ పొత్తులన్నీ కూడా ఎన్నికల ముందే ఏర్పడతాయని ఆయన చెప్పారు. ప్రజల మద్దతు ఉన్న పార్టీలదే విజయమని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa