ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలుషిత నీరుతో ఒకరి మరణం...పలువురి అస్వస్థత

national |  Suryaa Desk  | Published : Wed, Jun 01, 2022, 03:39 AM

మతపరమైన అంశాల చుట్టూ కర్ణాటక  రాజకీయం సాగుతున్న తరుణంలో అక్కడి ప్రజా సమస్యలు  మాత్రం గాలికి కొట్టుకుపోతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ రాయచూర్ నగరంలో కలుషిత నీరు తాగి ఒకరు మృతి చెందారు. 23 మంది చిన్నారులతో సహా 62 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ 62 మంది ఆస్పత్రిలో చేరినట్టు రాయచూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపరింటెండెంట్ డాక్టర్ భాస్కర్ మంగళవారం తెలిపారు. వారంతా చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.


మే 29న ఇందిరానగర్‌కు చెందిన 40 ఏళ్ల మల్లమ్మతో పాటు మరో 31 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఖ్య మంగళవారం నాటికి 62కి చేరింది. ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ మేరకు రాంపూరు రిజర్వాయర్‌ నుంచి నీరు సరఫరా అయ్యే వార్డుల్లోని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని స్థానికులు తెలిపారు. మంచినీటి సరఫరాలో అధికారులు విఫలమయ్యారని రాయచూరు నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


రాష్ట్ర ప్రభుత్వం మంచినీటి సరఫరా కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కార్పొరేషన్ మాత్రం కలుషిత తాగునీటిని సరఫరా చేస్తుందని ఆరోపించారు. తాము ఎంత చెప్పినా జిల్లా అధికారులు కూడా తమ అభ్యర్థనలను పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇక నుంచైనా మంచి నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా మరోవైపు ఢిల్లీలో నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండే ఎండల్లో తాగునీరు అందకం విలవిల్లాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఒక్క బోరుపైనే స్థానికులు ఆధారపడుతున్నారు. దాంతో నీటి కోసం గొడవలు పడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa