కరోనా భారిన సోనియాగాంధీ ఈ నెల 8న ఈడీ ముందు విచారణకు హాజరవుతారా లేదా అన్న అంశంపై సంసిగ్ధత సాగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి కరోనా బారినపడ్డారు. ఆమెకు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సమన్లు జారీ కావడంతో ఈడీ విచారణకు జూన్ 8న సోనియా గాంధీ హాజరుకావాల్సి ఉండగా.. కరోనా సోకడం గమనార్హం. స్వల్ప కోవిడ్ లక్షణాలు బయటపడటంతో సోనియాకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఫలితాల్లో పాజిటివ్ తేలినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సోనియా గాంధీ హోం ఐసొలేషన్లోనే చికిత్స పొందుతున్నారు.
ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేత కేసీ వేణుగోపాల్కు కూడా కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సోనియా గాంధీతో గత వారం రోజులుగా సమావేశమైన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అయితే, వీరిలో కొందరు కోవిడ్ బారినపడ్డట్టు సమాచారం.
ఇక, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారమే సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. జూన్ 8న ఈడీ ముందుకు సోనియా గాంధీ హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇదే సమయంలో ఆమె వైరస్ బారినపడటం సంధిగ్దత నెలకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa