ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆల్ ఇండియా నేషనల్ నీట్ ఎంట్రన్స్ పరీక్షల్లో 81వ ర్యాంక్ సాధించిన ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 02:09 PM

పోలాకి మండలం, ఆల్ ఇండియా నేషనల్ నీట్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్షలలో పోలాకి మండలం ఈదులవలస ఆదర్శ పాఠశాల లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆర్. పద్మాకర్ రావు ఆల్ ఇండియా లో 81 వ ర్యాంకు సాధించి పాఠశాలకు ప్రతిభను కనబరిచాడు.శుక్రవారం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ లో విద్యార్థికి ప్రిన్సిపాల్ పైడి ప్రవీణ పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు . శ్రేష్ట వారు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మా విద్యార్థి మంచి ర్యాంకును సాధించారు. ఈనెల 7వ తేదీన విద్యార్థి వెస్ట్ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రవేశం పొందడం జరుగుతుంది ఉన్నత విద్య పాఠశాల వారు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ . బొజ్జ జగన్నాథం విద్యార్థి తండ్రి ఆర్. త్రినాధ రావు ఫిజికల్ డైరెక్టర్.ఏం నీలం మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa