పదో తరగతి పరీక్షా ఫలితాల వెల్లడి అని ప్రకటించి, వెనక్కి తగ్గి వాయిదా వేయడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు. ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలను సోమవారానికి వాయిదా వేయడంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సీఎం జగన్ను ఉద్దేశించి ఓ ట్వీట్ వదిలారు. రాష్ట్ర పరిపాలన అంటే ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినంత సులభం కాదని వర్ల వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పదో తరగతి పరీక్షా ఫలితాల వెల్లడి అని ప్రకటించి, వెనక్కి తగ్గి వాయిదా వేయడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని సదరు ట్వీట్లో వర్ల వ్యాఖ్యానించారు. గతంలో ఇటువంటి సందర్భాలలో సంబంధిత మంత్రి రాజీనామా చేసేవారని ఆయన గుర్తు చేశారు. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న సత్తిబాబు సంగతేంటి సార్? అంటూ ఆయన సీఎం జగన్ను ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa