ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్యావరణ హిత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 05, 2022, 12:53 PM

గ్లోబల్ వార్మింగ్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యం అవుతుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు అని వై. వి . సుబ్బారెడ్డి తెలిపారు.  . ఈ సందర్భంగా గత మూడేళ్ళలో టీటీడీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ తీసుకున్న అనేక నిర్ణయాలు తీసుకున్నాము. రైతుసాధికార సంస్థ తో ఒప్పందం చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు పండించిన సెనగలు, బియ్యం, బెల్లం టీటీడీ కొనుగోలు చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని పర్యావరణ హిత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తాం. తిరుమలలో 10 వేల మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నాము. తిరుమలలో విద్యుత్ వాహనాల వినియోగం ప్రారంభించాము. త్వరలోనే ఆర్టీసీ 100 విద్యుత్ బస్సులు నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీవారి ప్రసాదాల కౌంటర్లలో ప్లాస్టిక్ బ్యాగ్ లు నిషేధించాము, వీటి స్థానంలో జ్యుట్, పర్యావరణానికి హాని కలిగించని బ్యాగ్ లు అందుబాటులో ఉంచాము అని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa