కడప జిల్లాలో కొత్త సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ జరుగుతోంది. జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ , భూ సేకరణ స్పెషల్ కలెక్టర్లతో పాటు ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఎస్ఈలతో ఎప్పటికప్పుడు భూ సేకరణపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంతో జాగర్తగా భూ సేకరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. సమస్యలను వెంటవెంటనే పరిష్కరిస్తున్నారు. మొత్తం తొమ్మిది సాగునీటి వనరుల పరిధిలో 10 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటికే ఆరు వేల ఎకరాల పరిధిలో డిక్లరేషన్స్ పూర్తి చేయగా, మిగిలిన భూమి సర్వే దశలో ఉంది. త్వరలోనే భూ సేకరణ పని పూర్తి కానుంది అని అధికారులు వెల్లడించారు. ఇంకా జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రూ. 1357 కోట్లతో రాజోలి రిజర్వాయర్, రూ. 852.59 కోట్లతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎర్రబల్లి, గిడ్డంగివారిపల్లె చెరువులను విస్తరించి వాటి పరిధిలోని పలు చెరువుల ద్వారా వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. దీంతోపాటు రూ. 45.49 కోట్లతో అలవలపాడు లిఫ్ట్ స్కీమ్, రూ. 1100 కోట్లతో పీబీసీ, జీకేఎల్ఐల పరిధిలోని పులివెందుల నియోజకవర్గంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు, రూ. 3050 కోట్లతో గండికోట, సీబీఆర్ లిఫ్ట్ అలాగే గండికోట, పైడిపాలెం లిఫ్ట్ పనులు రూ. 1182 కోట్లతో జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ పనులను చేపట్టారు. ఇది కాకుండా రూ. 50 కోట్ల నిధులతో బ్రహ్మంసాగర్ పరిధిలోని ప్యాకేజీ–1, ప్యాకేజీ–2 పనులు, తెలుగుగంగ పరిధిలోని ఎస్ఆర్–1లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు సంబంధించిన పనులను పూర్తి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa