విశాఖ నగర హెూంగార్డు ఒకరు బుధవారం గుండెపోటుతో మృతి చెందడంతో సహచరులు కన్నీటి పర్యంతమయ్యారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం దరి సత్తిపాలెంనకు చెందిన ఎన్. సత్తిబాబు (59) 1992లో హెూంగార్డు(హెచీ 234) చేరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో డిప్యూటేషన్ పై పని చేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి ఆయనకు ఆరోగ్యం బాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం మళ్లీ నలతగా ఉండడంతో అధికారులు ఆయన్ను ఇక్కడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. రాత్రి 8గంటల సమయంలో ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
ఆయనకు భార్య లక్ష్మి, చిరంజీవి, ఉపేంద్ర అనే ఇద్దరు కుమారులున్నారని సహచర సిబ్బంది తెలిపారు. పెద్ద కొడుకు బీటెక్ పూర్తి చేయగా, చిన్నవాడు పదోతరగతి చదివారన్నారు. ఏళ్ల తరబడి హెూంగార్డుగా సేవలందించిన సత్తిబాబు తమ కళ్లముందు మరికనిపించకపోవడంతో విశాఖలోని హెూంగార్డులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉంటే సత్తిబాబు అంత్యక్రియల కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం కింద రూ. 10వేలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa