రాష్ట్రంలో జగన్ సర్కార్ దివాళా తీసిందని సీపీఐ ఏపీ రాష్ర్ట సమితి ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రానికి 3 ఏళ్ల కాలంలో అప్పులు తప్ప.. అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. జగన్ దిగే నాటికీ రూ. 10 లక్షల కోట్లు అప్పు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేశారని, ఎప్పుడు పూర్తి చేశారో చెప్పలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో 17 ఎమ్మెల్యే సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీపీఐ నేత రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఏమి చేయని జగన్కు, 175 సీట్లు ఎలా వస్తాయని అనుకుంటున్నారని ప్రశ్నించారు. 175 సీట్లు గెలవడానికి అసలు ఏ వర్గానికి మేలు చేశారో సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు అధికారాలు లేకపోగా.. వాళ్లను సీఎం జగన్ కీలుబొమ్మల్లా మార్చాడని ఆరోపించారు.
85 శాతం కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందితే ఎమ్మెల్యేలను మారుస్తానని సీఎం జగన్ ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదని సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు. ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తలుచుకుంటే సీఎం జగన్కు శుక్రవారం దాటదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్కు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందని.. లేదంటే మొదటి వారంలోనే సీఎం ఆఫీస్ క్లోస్ అవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీతో వైసీపీ గుద్దులు... కేంద్రంతో ముద్దులు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa