అమెరికాలో ఎంతో పరిణితితో, స్వేచ్ఛతో వ్యవహరిస్తుంటారు. కానీ స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉంటాయి. అమెరికాలో తమ పిల్లలకు పాఠాలు బోధన విషయంలో ముగ్గురు తల్లులు ఏకంగా కోర్టుకు ఎక్కారు. సదరు స్కూల్పై కేసు కూడా వేశారు. తమ బిడ్డలకు ట్రాన్స్జెండర్కు సంబంధించిన పాఠాలు బోధించడం ఆ తల్లుల ఆగ్రహానికి కారణం. పెన్సిల్వేనియాలో మౌంట్ లెబనాన్ స్కూల్లో ఫస్ట్గ్రేడ్ చదువుతున్న పిల్లలకు లింగ మార్పిడికి సంబంధించిన పాఠాలు చెబుతున్నట్టు ఆ తల్లులకు తెలిసింది. దాంతో వారికి తీవ్రంగా కోపం వచ్చింది.
ట్రాన్స్జెండర్ ట్రాన్సిషన్ గురించి పిల్లలకు బోధించడం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ తల్లులు గత వారం ఫెడరల్ దావా వేశారు. ఈ పాఠాలు చెబుతూ పేరెంట్స్ హక్కులను పట్టించుకోలేదని విద్యార్థుల తల్లులైన కార్మిల్లా టాటెల్, స్టేసీ డన్, గ్రెట్చెన్ మెల్టన్ ఆరోపణలు చేశారు. ఫెడరల్ కోర్టులో దీనిపై విచారణ చేయాలని వారు కోరారు. వారు వేసిన పిటిషన్లో జిల్లా సూపరింటెండెంట్, పాఠశాల బోర్డు, ఫస్ట్-గ్రేడ్ టీచర్ మేగాన్ విలియమ్స్ పేర్లను పేర్కొన్నారు. అంతేకాదు ఆన్లైన్ పాఠ్యాంశాల్లో భాగంగా ట్రాన్స్జెండర్కు సంబంధించిన అంశాలను బోధించడం క్షమించరాని నేరమని తల్లులు పేర్కొన్నారు.
అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని సంబంధిత స్కూల్ ప్రతినిధి అన్నారు. తల్లుల ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. పూర్తి విషయాలు తెలుసుకోకుండా విద్యార్థుల తల్లులు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇందులో పూర్తి నిజనిజాలను పరిశీలించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa