నాగాలాండ్లోని ఓఖా జిల్లాలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అంతరించిపోతోన్న అరుదైన హార్న్బిల్ పక్షిని కర్రతో కొందరు హింసించారు. ఈ ఘటనను పక్కన ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో కాస్త ఈ వీడియో వైరల్ అవడంతో జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగాలాండ్ అటవీశాఖ మరియు వైల్డ్లైఫ్ శాఖకు చెందిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పక్షిని చిత్రహింసలు పెట్టి చంపిన ముగ్గురుని అరెస్టు చేశారు. అయితే నిందితులకు సంబంధించి ఎలాంటి సమాచారంను పోలీసులు బయటపెట్టలేదు. ఇదిలా ఉంటే గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ పక్షులు నాగాలాండ్లో ఉంటాయి. ఈ పక్షిని అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చేర్చింది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్స్ సంస్థ.
అంతరించిపోతున్న పశుపక్ష్యాదులను కాపాడుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. భవిష్యత్ తరాలకు మచ్చుకైనా చూపించేందుకు ఈ పశుపక్ష్యాదులు ఇక ఉండవేమో అనిపించేలా మనిషి వీటిని మాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే పులులు, పలు జాతులకు చెందిన ఏనుగులు,పలు పక్షులు అంతరించిపోయే అవకాశం ఉందని జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈశాన్య భారతంలోని నాగాలాండ్ రాష్ట్రంలో ఓ ఘటన చోటుచేసుకుంది. అరుదైన ఓ పక్షిని కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈశాన్య భారతం కొండకోనలకు, దట్టమైన అడవులకు ప్రసిద్ధి చెందింది. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇందుకోసమే అక్కడ పశుపక్ష్యాదులు ఎక్కువగా కనిపిస్తాయి. దేశం మొత్తం మీద కనిపించని కొన్ని పక్షులు ఈశాన్య రాష్ట్రాల్లో మనకు దర్శనమిస్తాయి. అక్కడికి వెళ్లిన పర్యాటకులను తమ కిలకిలరావాలతో పలకరిస్తాయి. కొన్ని పక్షులు చూసేందుకు ఎంతో ముద్దుగా ముచ్చటగా కనిపిస్తాయి.ఇక కొన్ని జాతి పక్షులు అంతరించిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి అరుదైన పక్షులను కాపాడుకోవాల్సింది పోయి వాటిని చిత్రహింసలకు గురిచేసి చంపేసిన ఘటన నాగాలాండ్లో వెలుగు చూసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa