ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కనీస పరిజ్ఞానం లేకుండా వార్త కథనాలు రాసినట్లుగా కనిపిస్తోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 12:08 PM

పంట నష్టపరిహారం చెల్లించే విషయంలో పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ఈ–క్రాప్‌ నమోదు చేసిన వెంటనే ఈ–కేవైసీ కూడా చేయిస్తున్నాం. దానికి సరిపడ వివరాలు నమోదు చేసి థంబ్‌ వేస్తేనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. అయితే ఈ రోజు మొట్ట మొదటిసారిగా ఎన్నడూ లేని విధంగా రూ.2,977.82 కోట్లు ఒకే విడతలో ఉచిత పంటల బీమా పథకం కింద నష్టపరిహారం అందిచాం అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....  నియమ నిబంధనలకు లోబడి ఈ డబ్బులు జమ చేశాం. దీనిపై కొన్ని పత్రికల రాతలు బాధాకరం. విమర్శించే వారి వ్యాఖ్యలు గమనిస్తే..స్థూలంగా రైతు నష్టపోవాలనే ఆలోచనలోఉన్నట్లుగా కనిపిస్తోంది. కనీస పరిజ్ఞానం లేకుండా వార్త కథనాలు రాసినట్లుగా కనిపిస్తోంది. ఆ పత్రికల వారికి ట్రైనింగ్‌ అవసరమేమో అన్న అనుమానం కలుగుతుంది.  ఓ పత్రికలో అరకొర బీమా అని రాశారు. వేరుశనగకు నామమాత్రపు పరిహారం..జిల్లాల వారీగా పరిహారం వివరాలు గోప్యం. ఇందులో గోప్యం ఏముంది? అందరికీ ఈ వివరాలు వెల్లడిస్తున్నాను. ఇదిగో చూడండి. 2,977 కోట్లు ఇస్తున్నప్పుడు ఇందులో గోప్యం ఏముంటుంది?. అందరికీ ఇచ్చాం. అన్ని వివరాలు ఉన్నాయి. మాట్లాడే వారికి, రాసే వాడికి విషయ పరిజ్ఞానం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa