రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుపేదలకు ఇళ్ల పట్టాలతో పాటు గృహ నిర్మాణాలు చేపట్టాలని జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కాలనీ ఏర్పాట్లలో రెవెన్యూ అధికారులు చేతివాటం రోజు రోజుకి పెరిగిపోతుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం మిల్లమపల్లిలోని టోల్గేట్ సమీపంలో 1000 మందికి పైగా లబ్ధిదారులతో జగనన్న లే అవుట్ ఏర్పాటు చేశారు. అయితే రెవెన్యూ శాఖ సంబంధించి ఒకరిద్దరు అధికారులు ప్లాట్ నంబర్లు లేకుండా పట్టాల పంపిణీ, ఒకే నంబరు ఇద్దరికి ఇవ్వడం, అసలు లేక్కే తేలకుండా పట్టాలు మాయం చేస్తుండడంతో గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళం ఏ స్థాయిలో ఉందంటే అర్హత ఉన్న లబ్ధిదారులు కూడా వారి పట్టా, స్థలం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సినంత .
న్యాయం కోసం బాధితులు తహసీల్దార్ కార్యాలయంలో తిరిగిన న్యాయం జరగలేదు. దాంతో వారందరు చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. పట్టాల పంపిణీ సమయంలో ఒక్కోక్క పట్టాకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. జగనన్న కాలనీలో నిరుపేదలకే కాకుండా కోట్లకు పడగలెత్తిన వారు, ఉద్యోగస్తులకు కూడా పదుల సంఖ్యలో పట్టాలు,స్థలాలు ఉన్నట్లు సమాచారం. దీనిపై పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు విచారణ జరిపితే చాలా దొంగ పట్టాల కోటీశ్వరుల, ఉద్యోగస్తులు అలాగే చేతివాటం ప్రదర్శించిన రెవెన్యూ అధికారులు బయటపడతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa