సెల్పీలు ప్రాణాలు తీస్తున్న వాటి విషయంలో మన వారిలో ఇంకా మార్పు రావడంలేదు. సెల్పీల కోసం ఇంకా ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మధ్యప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ బాలిక మరో ఇద్దరు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మధ్యాహ్నం జబల్పూర్ జిల్లాలోని న్యూ బేదాఘాట్లో ఇది జరిగింది. ఒక బాలిక సెల్ఫీ తీసుకుంటూ నదిలో పడిపోయింది. అక్కడే ఉన్న మరో విద్యార్థి, వారి ఉపాధ్యాయుడు ఆమెను రక్షించడానికి వెంటనే నదిలో దూకారు. అయితే నదీ ప్రవాహంలో ముగ్గురు కొట్టుకుపోయారు.
పారామెడికల్ కోర్సులో అడ్మిషన్ కోసం తమ టీచర్తో రాకేష్ ఆర్యతో కలసి విద్యార్థులు జబల్పూర్కు వచ్చారు. జబల్పూర్ చేరుకున్న తర్వాత ఆ బృందం నర్మదా నది ఒడ్డున ఉన్న భేదాఘాట్ను సందర్శించాలనుకున్నారు. అది ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్ కావడంతో అందరూ అక్కడకు వెళ్లారు. అయితే నది దగ్గర ఖుష్భూ సెల్ఫీ తీసుకుంటుండగా పొరపరాటు నీటిలో పడిపోయింది. "సెల్ఫీ తీసుకుంటుండగా ఖుష్బూ నీటిలో పడిపోవడంతో రాకేష్ ఆర్య, రామ్ సాహూ కూడా నదిలోకి దూకారు" అని మరో విద్యార్థి అభిషేక్ పోలీసులకు తెలియజేశారు.
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో బుధవారం సాయంత్రం బాలిక మృతదేహాన్ని బయటకు తీయగా.. మరో ఇద్దరి మృతదేహాలను గురువారం వెలికి తీశారు. చనిపోయినవారిని ఖుష్బూ సింగ్, రాకేష్ ఆర్య, రామ్ సాహూగా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో కూడా చాలామంది సెల్ఫీ తీసుకునే సరదాలో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. కొంతమంది గాయాలతో బయటపడగా.. మరికొందరు లోకాన్ని విడిచిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa