ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో గుండె పోటు తో భక్తుడి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 03:24 AM

వెంకటేశ్వరుడిపై భక్తితో కాలినడకన తిరుమలకు వచ్చాడు. కానీ అకస్మత్తుగా గుండెపోటు వచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. తిరుమలలో ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. భక్తుడిని బెంగళూర్‌కు చెందిన నవీన్ కుమార్ (39)గా గుర్తించారు. ఆయన కాలినడకన తిరుమల కొండకు చేరుకున్నారు. నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్దకు వచ్చారు. అక్కడ అకస్మాత్తుగా గుండెపోటు కుప్పకూలారు. సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది ఆయణ్ని వెంటనే అశ్వినీ హాస్పిటల్‌కి తరలించారు. అయితే, నవీన్ కుమార్ అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa