కూతురంటే ఏ తండ్రికైనా ఎనలేని అభిమానం. ఆ అభిమానం సామాన్యుడికైనా సీఎం కైనా ఒక్కటే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన కూతురు కోసం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనడం కోసం ఇటీవలే దావోస్ వెళ్లొచ్చిన సీఎం జగన్.. మరోసారి యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. జూన్ 28న ఆయన పారిస్ వెళ్లనున్నారు. దావోస్ పర్యటన అధికారికం కాగా వ్యక్తిగత పని మీద ఆయన పారిస్ వెళ్లనున్నారు. ఇదిలావుంటే దావోస్ పర్యటన సందర్భంగా సీఎం జగన్ లండన్ వెళ్లారు. దీంతో ఆయన కుమార్తె కోసమే లండన్ వెళ్లారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాగా ఈ విషయమై మంత్రి బుగ్గన క్లారిటీ ఇచ్చారు. విమానం రీఫిల్ కోసం ఇస్తాంబుల్లో ఎక్కువ సేపు ఆపాల్సి వచ్చింది. అప్పటికే రాత్రి 10 గంటలు దాటడంతో జ్యూరిక్లో విమానం ల్యాండింగ్కు నిబంధనలు అడ్డొచ్చాయని.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో లండన్ వెళ్లాల్సి వచ్చిందని బుగ్గన తెలిపారు.
సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి పారిస్లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ చేస్తున్నారు. జూలై 2వ తేదీన స్నాతకోత్సవం నిర్వహిస్తుండటంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం జగన్ పారిస్ వెళ్లనున్నారు.
ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చదవడం కోసం హర్షా రెడ్డి 2020 ఆగష్టు చివర్లో పారిస్ వెళ్లారు. బెంగళూరు నుంచి ఆమె బయల్దేరి వెళ్లగా.. సీఎం జగన్ దంపతులు ఆమెకు సెండాఫ్ ఇచ్చారు. ఇన్సీడ్లో చేరడానికి ముందు హర్షా రెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె స్కూల్ ఎడ్యుకేషన్ను బెంగళూరులో పూర్తి చేశారు.
దావోస్ పర్యటన సందర్భంగా సీఎం జగన్ లండన్ వెళ్లారు. దీంతో ఆయన కుమార్తె కోసమే లండన్ వెళ్లారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాగా ఈ విషయమై మంత్రి బుగ్గన క్లారిటీ ఇచ్చారు. విమానం రీఫిల్ కోసం ఇస్తాంబుల్లో ఎక్కువ సేపు ఆపాల్సి వచ్చింది. అప్పటికే రాత్రి 10 గంటలు దాటడంతో జ్యూరిక్లో విమానం ల్యాండింగ్కు నిబంధనలు అడ్డొచ్చాయని.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో లండన్ వెళ్లాల్సి వచ్చిందని బుగ్గన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa