ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సర్కార్ కీలక నిర్ణయంతో...సచివాలయ ఉద్యోగుల దశ తిరిగింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 03:26 AM

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకొని.. డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో పాసైన ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయనున్నారు. ఈ అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. గురువారమే దీనికి సంబంధించిన దస్త్రంపై సీఎం జగన్ సంతకం చేయగా.. అధికారిక ఉత్తర్వులు శుక్రవారం వెలువడతాయని భావిస్తున్నారు.


దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నూతన పే స్కేల్ ప్రకారం జీతాలు పెరుగుతాయి. డిపార్ట్‌మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ప్రొబేషన్ పూర్తయిన వారికి మాత్రమే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు అందుతాయని తెలుస్తోంది. ఏపీపీస్సీ నిర్వహించిన డిపార్ట్‌మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని వారి కోసం ఈ నెలలోనే మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్సఉడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.


జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్ర స్థాయిలో సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 15 వేలకుపైగా గ్రామ సచివాలయాల్లో 1.15 లక్షల మందికిపైగా ఉద్యోగులను నియమించింది. 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. వారికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రొబేషన్ గడువు పూర్తయ్యాక డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించి పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే 2021 నవంబర్‌లో ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa