నిరసనకారుల నిరసనలతో కొన్ని సందర్భాలలో సాధారణ ప్రజలు ఇబ్బందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి ఘటనే అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనల్లో చోటు చేసుకొంది. దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకంపై మిన్నంటిన నిరసనల్లో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని మథురలో నిరసనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ప్రతిదాడితో వారిని కట్టడి చేయడానికి పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ దాడి మధ్యలో ఓ తండ్రి తన పిల్లవాడిని కాపాడుకోవడానికి పరుగులు తీశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్మెంట్ స్కీమ్కు వ్యతిరేకంగా యూపీలో మథురలోని హైవేలో నిరసనకారులు ఆందోళన చేశారు. ఇందులో భాగంగా రాళ్లు రువ్వారు. హైవేపై ఉన్న పలు కార్లు, ట్రక్కుల అద్దాలను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి... వారిని ప్రతిఘటించేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ క్రమంలో వారి మధ్య ఓ కుటుంబం అక్కడ చిక్కుకుపోయింది. దాంతో అందులో ఓ వ్యక్తి తన కొడుకుని ఎత్తుకుని పోలీసుల వైపు పరుగులు తీశాడు. అతని భార్య వారిని అనుసరించింది. చివరికి చిన్నారితో సహా వారిద్దరూ పోలీస్ రక్షణ కవర్ ఉన్న వైపునకు సురక్షితంగా చేరుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోపై మథుర పోలీసులు కూడా స్పందించారు. ఆ సమయంలో సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారని, హింసకు పాల్పడిన నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా తూర్పు ఉత్తరప్రదేశ్లోని బల్లియాలో శుక్రవారం ఉదయం ఒక గుంపు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి కోచ్కు నిప్పంటించింది. రైల్వే స్టేషన్ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. నిరసనకారులు వారిని చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించారు.
ఈ అగ్నిపథ్ పథకంపై అభ్యర్థులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ పథకం కింద కేవలం నాలుగేళ్లకు మాత్రమే సైనికులను నియమిస్తారు. ఆ నాలుగేళ్ల తర్వాత 75 శాతం మంది సైనికులను వెనక్కి పంపుతారు. అందులో 25 శాతం మంది సైనికులను మరో 15 ఏళ్లపాటు ఉంచుతారు. ఈ పదవీ కాలం తర్వాత ఉద్యోగాలు పోవడమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉండవని ఇప్పుడు అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa