ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గెలిచినా...ఓడినా ద‌క్షిణాది మనదే: బీజేపీ ధీమా అదే

national |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 02:15 AM

ద‌క్షిణాదిలో బలపడే యోచన చేస్తున్న బీజేపీకి గెలిచినా, ఓడినా లాభమేనన్న కోణంలో ధీమాతో ముందుకెళ్తోంది. ఈ ధీమాతోనే వచ్చే ఎన్నికల్లో ద‌క్షిణాదిలో పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇక ఏపీలో బలపడాలని సమాలోచనలు చేస్తోంది. ఇకపోతే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 25 లోక్‌స‌భ స్థానాలున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తామ‌నే న‌మ్మ‌కం భార‌తీయ జ‌న‌తాపార్టీ పెద్ద‌ల‌కు ఏ కోశానా లేదు. ఇక్క‌డున్న నేత‌ల‌పై వారికి అంత న‌మ్మ‌కం ఉంది. వారికి కావ‌ల్సింది లోక్‌సభ స్థానాలు. తెలుగుదేశం గెలిచినా, జ‌న‌సేన గెలిచినా, వైసీపీ గెలిచినా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌చ్చినా 25 సీట్లు బీజేపీ ఖాతాలోనే ప‌డ‌తాయి.


దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం కాంగ్రెస్ బ‌ల‌హీన స్థితిలో ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. బీజేపీ హ‌యాంలో అందులోను ముఖ్యంగా న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా హ‌యాంలో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో క‌న‌ప‌డ‌టంలేదు. ద‌క్షిణాదిలో బ‌ల‌ప‌డ‌టానికి ఇదే మంచి త‌రుణ‌మ‌ని బీజేపీ భావిస్తున్న‌ప్ప‌టికీ ఆ పార్టీకి ఎక్క‌డా స్పేస్ లేదు. ఏపీలో వైసీపీ, టీడీపీ బ‌లంగా ఉన్నాయి. తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌తోపాటు కాంగ్రెస్ కు కూడా క్షేత్ర‌స్థాయిలో బ‌లం ఉంది. త‌మిళ‌నాడు, కేర‌ళ‌ సంగ‌తి స‌రేస‌రి. క‌ర్ణాట‌క ఒక్క‌టే బీజేపీకి ఊర‌ట‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa