ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుద్వారాలో పేలిన బాంబులు..ముగ్గురి మరణం

international |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 02:39 AM

అప్ఘనిస్థాన్ మరోసారి బాంబు పేళ్లులతో అట్టుడికింది. ఈ సారి గురుద్వారాలు పేళ్లులు సంభవించాయి. అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని గురుద్వారాలో రెండు పేలుళ్లు సంభవించాయి. కర్తే పర్వాన్ ప్రాంతంలో గురుద్వారా గేట్ల దగ్గర పేలుళ్లు జరిగాయి. తుపాకీ కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయి. ఆ సమయంలో గురుద్వారాలో చాలామంది భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. వారిద్దరిలో ఒకరు సిక్కు భక్తుడు, మరొకరు అఫ్ఘన్ సెక్యూరిటీ గార్డు అహ్మద్‌ అని అఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ నఫీ టాకూర్‌ తెలిపారు.


"నగరంలోని పవిత్ర గురుద్వారాపై దాడిపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాం. మేము పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. ఈ పరిణామాలపై మరిన్ని వివరాల కోసం వేచి ఉన్నాం." అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే గురుద్వారా కార్తె పర్వాన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాలి. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. కమ్యూనిటీ సంక్షేమమే మొదటి ప్రాధాన్యం." అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా ట్వీట్ చేశారు.


ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ సంఘటనలో అనేక మంది చ‌నిపోయి ఉంటార‌ని స్థానిక మీడియా పేర్కొంది. గురుద్వారా లోపల ఇంకా చాలామంది చనిపోయి ఉంటారని, వారి సంఖ్య ఇంకా తెలియరాలేదని స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకారం గురుద్వారా నుంచి ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చారని, వారిలో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారని బీజేపీ నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సా కూడా తెలిపారు. అయితే చాలామంది భక్తులు తప్పించుకోగలిగినట్టు తెలుస్తుంది.


కాబూల్‌లో ఉదయం ఏడు గంటల సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఉద‌యం ప్రార్థ‌న‌లో సుమారు 30 మంది భక్తులు పాల్గొన్నట్టు సమాచారం. ఆ స‌మ‌యంలో దుండ‌గులు గురుద్వారా ప్రాంగ‌ణంలోకి ప్రవేశించారు. అది గమనించిన సుమారు 15 మంది అక్ప‌కడి నుంచి పరారీ అయ్యారు. మిగతా వారంతా లోప‌ల చిక్కుకుని ఉంటార‌ని లేదా మ‌ర‌ణించి ఉంటార‌ని స్థానిక అధికారులు భావిస్తున్నారు. కాగా పేలుళ్లు జరిగిన కార్తే పర్వాన్ అఫ్ఘన్ హిందూ, సిక్కు వర్గాలకు కేంద్రంగా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa