2019 ఎన్నికల ముందు జగన్ పాదయాత్రలో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చాక ప్రజలను మభ్యపెట్టి ఇచ్చిన హామీలను మరిచి రాష్ట్రంలో అరాచక పాలన అందిస్తున్నారు అని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అవ్వాతాతలకు 3వేలపెన్షన్ అని మోసంచేశారు. 45ఏళ్లకే పెన్షన్,అందరికీ అమ్మఒడి, ఒంటరిమహిళ పెన్షన్, ఎస్సీ,ఎస్టీల ఉచితవిద్యుత్ లోనూ మోసమే. ఆరోగ్యశ్రీని అటకెక్కించారు. రైతులమోటార్లకు మీటర్లుపెట్టారు. మోసపుహామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ నేడు ఒక్కోపథకాన్ని అటకెక్కించి ప్రజలను మోసంచేశాడు అని ఆరోపించారు. వీటన్నిటికీ కలిపి లెక్క చెప్పే రోజు ఒకటి వస్తుంది అని, ఆ రోజు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa