కేరళ రాజధాని తిరువనంతపురంలోని సీపీఎం ప్రధాన కార్యాలయం పై బాంబు దాడి జరిగింది. గురువారం రాత్రి 11.30కి ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి టూవీలర్ పై వచ్చి బాంబు విసిరాడు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.
కార్యాలయం పాక్షికంగా ధ్వంసం అయ్యింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కమ్యూనిష్టు శ్రేణులు సంయమనం పాటించాలని, ఆందోళన చేయవద్దని నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ ఘటన పై పోలీసులు విచారణ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa