ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంపర్ ఫ్లాన్లు ప్రకటించిన...బిఎస్ఎన్ఎల్

business |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 02:04 PM

బిఎస్ఎన్ఎల్ తాజాగా తన కస్టమర్లను ఆకట్టుకొనేందుకు అనేక ప్లాన్ లను తీసుకొస్తోంది. ప్రభుత్వ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) కొత్తగా మరో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఇటీవల ఆఫర్లను ప్రకటించడంతో పాటు ప్లాన్‌లను తీసుకురావడంలో దూకుడు ప్రదర్శిస్తున్న బీఎస్ఎన్ఎల్ దీన్ని కొనసాగించింది. యూజర్ల కోసం మరో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. పూర్తి నెల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. అంటే నెలలో ఎన్ని రోజులు ఉంటే అంత వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లను ఈనెలలో ఏ రోజు రీచార్జ్ చేసుకుంటే తర్వాతి నెల అదే రోజు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నెల వ్యాలిడిటీతో బిఎస్ఎన్ఎల్ కొత్తగా రూ.228, రూ.239 ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. డేటా, కాల్స్, ఎస్ఎంఎస్ సహా మరిన్ని ప్రయోజనాలను ఈ ప్లాన్స్ కలిగి ఉన్నాయి. పూర్తి వివరాలివే. బిఎస్ఎన్ఎల్ రూ.228 ప్లాన్‌ బీఎస్ఎన్ఎల్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్లాన్‌ వాయిస్ వౌచర్స్ విభాగంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. రూ.228 (STV_228) ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీతో ప్రతీ రోజు 2జీబీ డేటా లభిస్తుంది. అన్‌‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు దక్కుతాయి. రోజులో 2జీబీ డేటా అయిపోతే 80కేబీపీఎస్‌తో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌తో ప్రోగ్రెసివ్ వెబ్‌యాప్‌పై ఛాలెంజెస్ ఏరేనా మొబైల్‌ గేమింగ్ సర్వీస్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు. బిఎస్ఎన్ఎల్ రూ.239 ప్లాన్‌ ఈ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ కూడా ఇప్పటికే లభ్యమవుతోంది. రూ.239 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే ప్రతీ రోజు 2జీబీ డేటా దక్కుతుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ కూడా పూర్తి నెల ఉంటుంది. ఈ ప్లాన్‌తో అదనంగా రూ.10 టాక్‌టైమ్ లభిస్తుంది. రోజులో 2జీబీ డేటా అయిపోయాక 80కేబీపీఎస్ వేగంతో డేటా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌తో కూడా చాలెండ్ ఎరేనా మొబైల్‌ గేమింగ్ సర్వీస్ ఫ్రీగా లభిస్తుంది. ఈ రెండు ప్లాన్‌లు క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు ఈనెల 5వ తేదీ ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే మళ్లీ వచ్చే నెల ఇదే రోజు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్ ఐడియా ఇలాంటి ప్లాన్‌లు తీసుకురాగా.. వాటికి పోటీగా బీఎస్ఎన్ఎల్ కూడా ఇప్పుడు రెండింటిని లాంచ్ చేసింది. మరోవైపు దేశంలో 4జీ సేవలను లాంచ్ చేసేందుకు బీఎస్ఎన్ఎల్ సమాయత్తమవుతోంది. ముందుగా ఆగస్టులో కొన్ని ప్రాంతాల్లో 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించి.. ఈ ఏడాది చివరి కల్లా దేశమంతా విస్తరింపజేయాలని ప్లాన్‌ చేస్తోంది. ప్రస్తుతమైతే బీఎస్ఎన్ఎల్ 3జీ సర్వీస్‌లు అందుబాటులో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa