ఉద్యోగుల్ని జగన్ తన కాలికింద బానిసల్లా చూస్తున్నారని, ఉద్యోగులకు రావాల్సిన వేతనాలు సకాలనికి ఇవ్వటం లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలి.. తన సొంత పార్టీ కార్యకర్తలైన వాలంటీర్లకు ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసేది ఉద్యోగులేనని.. దేశంలో ఏ ప్రభుత్వమైనా సజావుగా పాలన సాగించాలంటే దానికి ఉద్యోగుల కృషి తప్పనిసరి అన్నారు. కానీ అలాంటి ఉద్యోగుల్ని జగన్ తన కాలికింద బానిసల్లా చూస్తున్నారని.. ఉద్యోగులకు రావాల్సిన వేతనాలు సకాలనికి ఇవ్వటం లేదన్నారు. వైఎస్సార్సీపీ మూడేళ్ల పాలనలో ప్రతి నెలా 1న జీతాలు అందుకున్న సంఘటనలు అరుదుగా ఉన్నాయన్నారు. మరో వైపు రివర్స్ పీఆర్సీతో ఉన్న జీతాల్లో కోత విధించారని.. డీఏలు, అలవెన్సులు లేవని.. ఉద్యోగులకు అన్ని విధాల అన్యాయం చేస్తున్న జగన్ తన పార్టీ కార్యకర్తలైన వాలంటీర్లకు మాత్రం అన్ని విధాల న్యాయం చేస్తున్నారని విమర్శించారు.
వాలంటీర్లకు ప్రభుత్వ సొమ్మును నెలకు రూ. 5 వేలు దోచిపెడుతున్నారని.. జగన్ దొంగ నాటకాలు, మాయమాటలు ప్రజలు నమ్మే రోజులు పోయాయి అన్నారు. ఆయన ఏం చేసినా ప్రభుత్వ ఖజానాను తను, తన మనుషులు దోచుకునేందుకే అన్నది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్దమవుతోందన్నారు. ప్రజలకు ఉపయోగపడే విదేశీ విద్య, పేదల కడుపు నింపే అన్నక్యాంటీన్, ముస్లిం యువతులకు దుల్హన్ పథకం, బీసీల ఉపాధికి చేయూతనిచ్చే ఆధరణ పనిముట్లు, ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ యువత స్వయం ఉపాధినిచ్చే కార్పోరేషన్ రుణాలు రద్దు చేశారని విమర్శించారు. జగన్ తన సొంత పత్రికకు మాత్రం కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారన్నారు.
ప్రతి సంక్షేమ పథకంలోనూ ప్రజల్ని పీడించుకుని లంచాలు వసూలు చేస్తున్న వాలంటీర్లకు నెలకు రూ. 5 వేలు జీతం ఇవ్వటమే ఎక్కువ అని ప్రజలు భావిస్తుంటే.. జగన్ అవి చాలవన్నట్టు వారికి సేవారత్న, సేవా వజ్ర అంటూ అవార్డుల పేరుతో రూ.485.44 కోట్లు దోచిపెట్టారని ధ్వజమెత్తారు. ఇప్పుడు వార్తా పత్రికల కోసం అంటూ ఒక్కో వాలంటీర్ కు నెలకు రూ. 200 చొప్పున చెల్లించేందుకు జీవో జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో సుమారు 2.66 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారని.. వీరికి ప్రతి నెల రూ. 200 చొప్పున మెత్తం రూ. 5.50 కోట్లు ఖర్చువుంతుంది అన్నారు. ప్రభుత్వ ధనాన్ని వాలంటీర్లకు ఇస్తూ వారితో సొంత పత్రికకు కొనుగొలు చేసేలా చేసి తిరిగి ఆ డబ్బును తన సొంత ఖజానాకు లాక్కుంటున్నారని ఆరోపిచారు. జగన్ కన్నింగ్ నెస్ ఐడియాలజీతో బిజినెస్ చేస్తున్నారని.. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానంటున్న ఆయన తన సొంత పత్రికను తన పార్టీకార్యకర్తలకు ఉచితంగా ఇవ్వలేరా అంటూ ప్రశ్నించారు.
మరో వైపు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సహజవనరులు దోపిడి చేస్తూ ప్రభుత్వ స్ధలాలు ఖజ్జా చేస్తూ కోట్లు కూడబెడుతున్నారని ఆరోపించారు. మరో వైపు ప్రజలపై పన్నుల రూపంలో మోయలేని భారాలు మోపుతూ ఆ మొత్తాలను సొంతపత్రిక, ఛానల్కు ప్రభుత్వం మళ్లిస్తోందన్నారు. జగన్ ప్రజలకు చేస్తున్న వాటికంటే దాని గురించి ప్రచారం చేస్తూ తన సొంత పత్రికకు ప్రకటనల రూపంలో దోచిపెడుతున్నదే ఎక్కవని విమర్శించారు. ఒక్క పత్రికకే కేవలం 3 ఏళ్లలోనే రూ. 280 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారని.. ఈ సొమ్మంతా ప్రజలదే అన్నారు. జగన్ లూటీ చేసి తిన్న ప్రతి రూపాయిని కక్కించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa