ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ విమానయాన రంగంలోకి ఆకాశ ఎయిర్ ఎంట్రీ

national |  Suryaa Desk  | Published : Fri, Jul 08, 2022, 03:30 AM

భారతదేశ విమానయాన రంగంలోకి మరో సంస్థ ఎంట్రీ ఇచ్చింది. దిగ్గజ పెట్టుబడిదారుడు రాకేశ్ ఝున్ ఝున్ వాలా మద్దతుతో భారత్ విమానయాన రంగంలోకి అడుగుపెడుతున్న కొత్త ఎయిర్ లైన్స్ సంస్థ ఆకాశ ఎయిర్. ఆకాశ ఎయిర్ త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆకాశ ఎయిర్ ప్రధానంగా చవకధరల విమానయాన సంస్థ. భారత విమానయాన రంగ దిగ్గజం వినయ్ దూబే స్థాపించిన ఆకాశ ఎయిర్ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. త్వరలోనే మరో రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను అందుకోనుంది. ఇదిలావుంటే ఈ నూతన ఎయిర్ లైన్స్ సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా పచ్చజెండా ఊపింది. విమాన సర్వీసులకు అవసరమైన అనుమతులు మంజూరు చేసింది. విమానాలు నడిపేందుకు అవసరమైన ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ (ఏఓసీ)ని అందజేసింది. ఈ నేపథ్యంలో, జులై నెలాఖరుకు ఆకాశ ఎయిర్ తొలి విమానం గాల్లోకి లేవనుంది. ఆకాశ ఎయిర్ కు సీఈఓగా వ్యవహరిస్తున్న వినయ్ దూబే తాజా పరిణామాలపై స్పందిస్తూ, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా సేవలు అందించాలన్నది తమ లక్ష్యమని, ఆ దిశగా ప్రస్థానం ప్రారంభిస్తున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa