శ్రీలంకలో పోలీసులు, భద్రతా అధికార్ల దురాగతాలకు అంతేలేకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరసన కారులపై వారు పాశవికంగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలావుంటే భారీ విద్యుత్ కోతల కారణంగా ప్రజలు తిరగబడ్డారు. మార్చి నెలలో భారీ నిరసనలు చేపట్టారు. మండు వేసవిలో రోజుకు 13 గంటలు కరెంటు కోతతో ప్రజలు బాగా అలిసిపోయారు. ఆ అలసట కోపాన్ని రేకెత్తించింది. దాంతో, కొలొంబోలో దేశాధ్యక్షుడి ఇంటి ముందు వేలాదిమంది నిరసనలకు దిగారు. సుందర నదీశ్ అనే వ్యక్తి దేశంలోని రాజకీయ శక్తులను, మతాధికారులను, మీడియాను దుయ్యబడుతూ ప్రసంగం చేశారు. వీరంతా కలిసి దేశాన్ని సర్వనాశనం చేశారని తీవ్రగా ఆరోపించారు. దేశంలో ఇంత పనికిమాలిన ప్రభుత్వం ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో, పోలీసులు నదీశ్ను చావబాదారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నదీశ్ లాగే ఎంతోమంది పోలీసుల చేతుల్లో హింసకు గురయ్యారు.
మిలటరీలోని అత్యున్నత స్థాయి వర్గాలకు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్ష అత్యంత సన్నిహుతుడు. ఆయన మాజీ డిఫెన్స్ సెక్రటరీ కావడంతో రక్షణ రంగంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతో, అసమ్మతి తెలిపినవారంతా రాజ్య హింసకు బలవుతున్నారు. గత కొన్ని నెలలుగా ఇదే జరుగుతోంది. శాంతియుతంగా నిరసనలు జరిపినవారిని కూడా తుపాకీ కాల్పులతో భయపెట్టారు. చిన్నపిల్లలు ఉన్న చోట విచక్షణారహితంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిత్యావసర సరుకుల కోసం క్యూలలో నిల్చున్నవారు ఏ మాత్రం అసహనం ప్రదర్శించినా పోలీసుల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa