ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేచిచూడటం అక్కడ దైనందిన జీవితంగా మారింది

international |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 02:53 AM

శ్రీలంకలోని పరిస్థితుల్లో ఎపుడు మార్పు వస్తుందన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రతి అవసరం కోసం వేచిచూడటమే అక్కడి ప్రజల దైనందిన జీవితంగా మారింది. శ్రీలంకలో ప్రజలు రోజూ పొద్దున మేల్కొనేసరికే అలిసిపోతున్నారు. దేశంలో ఇంధనం కరువు తీవ్రంగా ఉండడంతో కరెంట్ కోతలు అర్థరాత్రుల వరకూ కొనసాగుతున్నాయి. ఉక్కపోత, వేడికి నిద్ర కరువైపోతోంది. నెలలు దాటినా ఇదే పరిస్థితి. ఇంట్లో పిల్లా పాపలు సహా అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏది ఎలా ఉన్నా కాలం ఆగిపోదు. రోజు గడవాల్సిందే. నిత్యావసర వస్తువుల ధరలు గత నెల కన్నా రెట్టింపు అయ్యాయి. రోజు రోజుకూ పరిస్థితి దిగజారిపోతోందే తప్ప ఆశ చిగురించట్లేదు.


ఉదయం లేచి ఏదో తిన్నామన్నట్టు తిని లేదా అసలు తినకుండా బయటకు పరుగులు పెట్టడం.. అసలు యుద్ధం ఇక్కడ మొదలవుతుంది. రవాణా దొరకదు. నగరాల్లో ఇంధనం కోసం క్యూలు కట్టడం ఆగలేదు. క్యూల పొడవు పెరుగుతూనే ఉంది. ఊరి చివర్ల వరకు విస్తరిస్తోంది. రోడ్లన్నీ గందరగోళంగా ఉన్నాయి. జీవితాలు నలిగిపోతున్నాయి. ఆటో డ్రైవర్లు తమ వాహనాల్లో ఎనిమిది లీటర్లు పెట్రోలు పోయించుకోడానికి రోజుల తరబడి క్యూలలో నిల్చుంటున్నారు. ఎనిమిది లీటర్లతో బహుశా ఓ రెండు రోజులు గడుస్తుంది. మళ్లీ క్యూ కట్టాల్సిందే. బట్టలు, తలగడలు, నీళ్లు తెచ్చుకుని క్యూలలోనే జీవితం గడుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa