రాష్ట్ర మహానాడుతో వచ్చిన జోష్ తో జిల్లాల వారీగా టీడీపీ మినీ మహానాడులను నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న మినీ మహానాడులకు ప్రజలు పోటెత్తుతున్నారు. చోడవరంలో జరిగిన మినీ మహానాడుకానీ, మదనపల్లెలో జరిగిన మినీ మహానాడు కానీ ఇందుకు అద్దం పడుతున్నాయి. మదనపల్లెలో జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ప్రజలు హాజరుకావడం, బాబు ప్రసంగాన్ని శ్రద్ధగా వినడం విశేషమే.
మే 28, 29 తేదీల్లో ఒంగోలులో మహానాడు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావడానికి ఈ కార్యక్రమానికి బస్సులు సమకూర్చమని ప్రభుత్వాన్ని కోరగా, నిరాకరించిందని తెలుగుదేశం పార్టీ నేతలు అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ ప్రజలు స్వచ్ఛంధంగా సొంత వాహనాల్లో తరలి రావడం, కార్యక్రమం అనూహ్య విజయం సాధించడంతో టీడీపీలో జోష్ పెరిగిపోయింది. అంచనాలకు మించి విజయవంతమైన మహానాడు స్ఫూర్తిని ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఏడాది పొడవునా కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు.
దీంతో ఎప్పుడూ లేనివిధంగా అన్ని జిల్లాలో మినీ మహానాడుల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఒక్కో జిల్లాలో ఒక్కో మహానాడుకు ఒక్కో పేరు పెట్టుకుంటూ వస్తున్నారు. మదనపల్లిలో జరిగిన మినీ మహానాడుకు 'ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్రన్న భరోసా' అనే పేరు పెట్టారు. జోరున కురుస్తున్న వర్షంలోను పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడం చూసే రాయలసీమకు చెందిన వైసీపీ నేతలంతా చంద్రబాబునాయుడిపై విరుచుకుపడుతున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa