వీఐపీల ప్రయాణాల కోసం రోడ్డుపైనున్న సామాన్యులు ఇబ్బంది పడాల్సి వస్తోందని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యానించారు. ఈ నేపథయంలో
ముఖ్యమంత్రి హోదాలో తాను ప్రయాణించే కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను నిలిపివేయాల్సిన అవసరం లేదని ఆయన రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా తన కాన్వాయ్కు ప్రత్యేకంగా ఏ ప్రొటోకాల్ కూడా అవసరం లేదని ఆయన సూచించారు. ఈ మేరకు ముంబై పోలీస్ కమిషనర్కు షిండే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ముంబై పోలీస్ కమిషనర్తో సమావేశమైన సందర్భంగా షిండే ఈ నిర్ణయం తీసుకున్నారు. వీవీఐపీల ప్రయాణాల కోసం సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఈ సందర్భంగా షిండే వ్యాఖ్యానించారు. ప్రజలకు కలుగుతున్న ఈ ఇబ్బందిని తొలగించేందుకు సీఎం కాన్వాయ్కు ఎలాంటి ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. అంతేకాకుండా తాను ప్రయాణించే మార్గంలో భద్రతను కూడా తగ్గించాలని ఆయన సూచించారు. తమది సామాన్యుల ప్రభుత్వమని.. ఈ కారణంగానే వీఐపీల కన్నా... సామాన్యులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నామని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa