ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుమార్తెపై ఏడాదిన్నరగా తండ్రి అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Sun, Jul 10, 2022, 09:42 AM

రాజస్థాన్‌ హనుమాన్‌ఘడ్‌కు చెందిన ఓ వ్యక్తి కన్నకుమార్తెపై ఏడాదిన్నరగా అత్యాచారం చేస్తున్నాడు. బాలిక తల్లి రెండేళ్ల క్రితం చనిపోయింది. మిగిలిన పిల్లలను మేనమామ వద్దకు పంపాడు. అయితే చిన్న కుమార్తెను తన వద్దే నిందితుడు ఉంచుకుని అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల మేనమామ ఇంటికి వెళ్లిన ఆమె వారికి ఈ విషయం చెప్పింది. బాలిక ఫిర్యాదుతో ఆమె తండ్రిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa