విమానయాన సంస్థ ఇండిగో కు ఆ సంస్థ ఉద్యోగులు ఝలక్ మీ ఝలక్ ఇస్తున్నారు. తాజాగా ఆ సంస్థ టెక్నికల్ సిబ్బంది నిరసనకు దిగారు. రెండు రోజులుగా మూకుమ్మడిగా సిక్ లీవ్ పెట్టారు. అతితక్కువ వేతనాలకు వ్యతిరేకంగా హైదరాబాద్, ఢిల్లీలో పనిచేస్తున్న సిబ్బంది నిరసన తెలుపుతున్నారని సంస్థ వర్గాలు వెల్లడించాయి. జూలై 2వ తేదీన ఇండిగో దేశీయ విమానాల్లో 55 శాతం ఆలస్యం అయ్యాయి. అయితే పెద్ద సంఖ్యలో క్యాబిన్ సిబ్బంది సిక్ లీవ్లో ఉండడమే దీనికి కారణమని తెలుస్తుంది.
అయితే లీవ్లో ఉన్న వారంతా టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా చేపట్టిన రిక్రూట్మెంట్ డ్రైవ్లో పాల్గొనేందుకు వెళ్లి ఉంటారని ఏవియేషన్ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇండిగో తన ఉద్యోగుల్లో చాలామంది ఉద్యోగులు జీతాలను తగ్గించింది. దీంతో చాలామంది సిబ్బందిలో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఉద్యోగులు నిరసన బాట పట్టినట్టు సమాచారం. అయితే దీనిపై ఇండిగో ఇప్పటి వరకు స్పందించలేదు.
మరోవైపు కొత్తగా వస్తున్న ఆకాశ ఎయిర్, పునర్వ్యవస్థీకరించిన జెట్ ఎయిర్ వేస్, టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా కూడా కొత్తగా రిక్రూట్మెంట్ను చేపట్టాయి. దాంతో కొత్తగా వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకునేందుకు పలువురు ఇతర ఎయిర్లైన్స్ సంస్థల ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సమాచారం. కాగా ఇండిగో ప్రస్తుతం రోజుకు 16 వందల దేశీయ అంతర్జాతీయ విమానాలను నడుపుతోంది. ఇండిగో దేశీయ విమానాలలో 45.2 శాతం శనివారం సమయానికి నడిచాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa