ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ వైపు కమెడియన్ పృథ్వీ చూపు..ఈ సారి ఎవరిపై విరుచుకుపడతాడో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 01:50 AM

పార్టీలు మార్చుతూ తిరుగుతున్న కమెడియన్ పృథ్వీ తాజాగా టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అమ్మనా బత్తాయో.. మళ్లీ ప్లేట్ మార్చేశాడు. పార్టీ బోర్డు తిప్పేశాడు కమెడియన్ పృథ్వీ. వైసీపీ పార్టీ బహిష్కరించడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన కమెడియన్ పృథ్వీ ఈ మధ్య అసమ్మతి స్వరం పెంచాడు. ఏ పార్టీ జెండానైతే భుజాన మోసి.. చిన్న పెద్ద తేడా తెలియకుండా చంద్రబాబుని.. పవన్ కళ్యాణ్‌ని చిరంజీవిని నోటికొచ్చినట్టు తిట్టాడో.. ఇప్పుడు అదే నోటితో వాళ్లకి క్షమాపణ చెప్తూ.. వైసీపీ పార్టీని దూషించడం మొదలుపెట్టాడు.


వైసీపీ పని అయిపోయిందని.. ఒక్క ఛాన్స్ అని అడిగిన వైసీపీ పార్టీని గట్టిగా నొక్కడానికి జనం సిద్ధంగా ఉన్నారంటూ ఫైర్ అయ్యారు పృథ్వీ. అంతేకాదు.. ఎల్లో మీడియాగా పేరొందిన ఛానల్‌లో చర్చకి వెళ్లి వైసీపీ పార్టీని ఏకిపారేశారు. ఆ పార్టీని ఉగ్రవాద శిక్షణా శిబిరంగా పోలుస్తూ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.


ఇదిలావుంటే తాజా ఇంటర్వ్యూలో పృథ్వీ మాట్లాడుతూ.. ‘వైసీపీలో నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు నేను హాయిగా ఉన్నాను.. ఇప్పుడు కావాలంటే.. చంద్రబాబు నాయుడుగారి దగ్గరకు వెళ్లొచ్చు.. ఆయన అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నా.. అప్పట్లో ఆయన్ని దూషిస్తూ ఒక పాటపాడాను. తప్పైపోయింది.. మీరు నన్ను క్షమించానని చెప్తే.. నేను అక్కడ నుంచి లేస్తా.. లేదంటే లేవను అని అంటాను.


అయినా చంద్రబాబు గారి స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి? ఆయన్ని గౌరవించకుండా మాట్లాడాను. వైసీపీలో ఉన్నప్పుడు తిట్టమని ప్రమోట్ చేసే వాళ్లు ఎక్కువ.. అది తప్పు అని చెప్పేవాళ్లు లేరు. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ని దూషించాను.. ఆయన్ని కూడా క్షమాపణ కోరితే గంగానదిలో మునిగినంత ప్రశాంతత ఉంటుంది నాకు.


నేను ఎవర్నెవర్నెని తిట్టానో వాళ్లందరికీ క్షమాపణ చెప్పేస్తున్నాను. కె. రాఘవేంద్రరావు గారికి కూడా క్షమాపణ చెప్పాను. అసలు దాసరి గారు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పార్టీ పక్కననెట్టు మాట్లాడు అని కమాండింగ్‌గా మాట్లాడేవారు.. నేను డాడీ డాడీ అనేవాడిని. ఆయన లేకపోవడం మా చిప్ పాడైపోయింది. ఇప్పుడు బాగా అయ్యింది కాబట్టి.. బాబు గారిని కలిసి క్షమాపణ చెప్తాను. అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్ట్‌లని తప్పుచేశాను.. వాళ్లకి క్షమాపణ చెప్పాను. చంద్రబాబు గారికి క్షమాపణ చెప్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు పృథ్వీ. మొన్న జనసేన అన్నారు.. ఇప్పుడు మళ్లీ టీడీపీ అంటున్నారు.. ఇక మిగిలింది బీజేపీ.. ఆ తరువాత కేఏ పాల్ పార్టీ.. ఎన్నికల లోపు పృథ్వీ పయనం ఎటో చూడాలి మరి.


ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారని.. తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని.. భీమవరం బీఫామ్ నాదే అంటూ ఫిక్స్ అయిపోయారు పృథ్వీ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కేవలం జనసేనకు మాత్రమే కలిసి వస్తుందని.. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని.. టీడీపీకి అవకాశం ఉండదన్నారు. బాల్ మా (జనసేన) కోర్టులో ఉంది. ఈసారి వన్ సైడ్‌ లవ్‌లు ఉండవు. ప్రజలు జనసేనవైపు మాత్రమే ఉంటారు’ అని భారీ డైలాగ్ కొట్టారు పృథ్వీ.


అయితే జనసేనను ఎంత పొగిడినా.. పవన్ కళ్యాణ్‌ను చేరువ కావడానికి.. జనసైనికుల్ని మెప్పించడానికి పృథ్వీ గట్టి ప్రయత్నాలు చేసినా.. మనోడ్ని పట్టించుకోవడం మానేశారు. కనీసం దిగువ స్థాయి నాయకులు కూడా పృథ్వీ పొగడ్తల్ని నమ్మకపోవడంతో ఇక లాభం లేదనుకున్నారో ఏమో కానీ మళ్లీ ఇప్పుడు పార్టీ మార్చేశారు. తాజాగా ఇప్పుడు టీడీపీ బాటపట్టారు. చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం వెయిటింగ్ అంటూ పాత తిట్లు, దూషణలకు ఆయింట్మెంట్ రాయడం మొదలుపెట్టారు. చంద్రబాబు స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి అంటూ కొత్త రాగం అందుకుని చంద్రబాబుని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa