మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ కు విల్ ఛైర్ పై వచ్చారు. ఇదిలావుంటే సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్కు దాదాపుగా అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా సోమవారం మధ్యాహ్నం పార్లమెంటులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వీల్ చెయిర్లో పోలింగ్ కేంద్రానికి రావడం, కనీసం ఓటు వేసేందుకు కూడా ఆయనకు ఇతరులు సహకరించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మేరకు ఆయన ఓటు వేస్తున్న సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆర్థిక వేత్తగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్... మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో దేశ ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు వరుసగా రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా పని చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం 89 ఏళ్ల వయసులో ఉన్న మన్మోహన్... 2019లో రాజ్యసభ సభ్యుడిగా మరో మారు పదవి చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఆయన వీల్ చెయిర్లో రావడం గమనార్హం. వయసురీత్యా అనారోగ్య కారణాలతోనే ఆయన ఇలా వీల్ చెయిర్లో వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa