మూడు రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే అవకాశం కల్పించిన నియోజక వర్గ ప్రజలు మేలు మరువలేనని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 15వ రాష్ట్రపతి ఎన్నికలు వెలగపూడిలోని సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ఎజెంట్లుగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, బుగ్గన రాజేంద్ర నాధ రెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజులు వ్యవహరించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్యే గా తొలుత ప్రణబ్ ముఖర్జీ, తరువాత దళితవర్గానికి చెందిన రామ్ నాధ్ కొవింద్, ఇప్పుడు గిరిజన మహిళ ద్రౌపతి ముర్ము రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలకు ఋణపడి వుంటానన్నారు. 151 మంది వైఎస్ఆర్ సిపిఎంఎల్ఏ లు ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa