గోదావరికి ఎన్నడూ లేనంతగా ఉధృతంగా వరదలు వచ్చాయని.. ముందుగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వరదలపై అధికారులను అలర్ట్ చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అనేక చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. గతంలో జిల్లాకు ఒక కలెక్టర్, ఒక జేసీ ఉండేవారు. ఇప్పుడు జిల్లాల విభజన వల్ల అధికారుల సంఖ్య పెరిగింది. వలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగులు, మంత్రులు సమన్వయంతో పని చేశారు. జిల్లాకు రెండు కోట్లు, నాలుగు కోట్లు చొప్పున కేటాయించారు. నిత్యావసర వస్తువులు, బిస్కెట్లు, పాలు, కిరోసిన్ అందించాం. సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. అధికారులతో రెగ్యులర్గా మానిటరింగ్ చేశారని’’ మంత్రి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa