జో బైడెన్ స్కిన్ క్యాన్సర్ తో బాధపడేవారని అమెరికాలోని వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఓ ప్రెస్మీట్లో తనకు క్యాన్సర్ ఉందని చెప్పారు. దాంతో ఆ అంశం హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికరమైన చర్చ కూడా సాగుతుంది. దాంతో వైట్హౌస్ రంగంలోకి దిగక తప్పలేదు. ఆయన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చింది. బైడన్ గత ఏడాది పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయనకున్న స్కిన్ క్యాన్సర్ గురించి ఆయన ప్రస్తావించినట్టు వైట్ హౌస్ వెల్లడించింది.
ఇటీవల బైడెన్ మసాచుసెట్స్లోని కోల్ మైన్ ప్లాంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా జో బైడెన్ గ్లోబల్ వార్మింగ్ గురించి చేసిన ప్రసంగించారు. ఈ సందర్భంగా తనని చిన్నతనంలో వారి ఇంటికి సమీపంలో ఉండే చమురు శుద్ధి కర్మాగారాల నుంచి వెలువడే ఉద్ఘారాలను వివరించారు. అవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం వేసేదో తెలియజేశారు. ఆ సందర్భంగా తను, అక్కడ ఉండే ఇతర వ్యక్తులు క్యాన్సర్ బారిన పడినట్టు తెలిపారు. ఆయిల్ రిఫైనరీల కారణంగా తనతో సహా ఆ ప్రాంతంలో ఎంతోమంది క్యాన్సర్ బారినపడ్డారని చెప్పారు. దేశంలోనే డెలావర్లో అత్యధిక క్యాన్సర్ రేటు ఉందని అన్నారు.
అయితే జో బైడన్ మాటలు సంచలనంగా మారాయి. కొద్ది క్షణాల్లో సోషల్ మీడియాలో దీనిపై చర్చ మొదలైంది. ఇక బైడెన్ క్యాన్సర్ గురించి మాట్లాడిన క్లిప్ను జోడిస్తూ జో బైడెన్ తనకు క్యాన్సర్ ఉందని ప్రకటించారా..? అంటూ ఆర్ఎన్సీ రీసెర్చ్ ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నలు రేకెత్తించింది. దీనిపై వాషింగ్టన్ పోస్ట్ చీఫ్ రైటర్ గ్లెన్ కెస్లర్ మండిపడ్డారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ముందు బైడెన్ మెడికల్ రిపోర్ట్ పరిశీలించాలని సూచించారు. బైడెన్ నాన్-మెలనమ స్కిన్ క్యాన్సర్లను సర్జరీ ద్వారా తొలగించినట్టు రిపోర్ట్లో ఉందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa