ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతకు జాబు రావాలంటే చంద్రబాబు రావాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 07:00 PM

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి జీడి పరిశ్రమకు చేరుకొని కార్మికులతో కలిసి పనిచేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి చదివి ఎన్నో ఆశలతో ఉన్న నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం అంధకారంలో నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబురావు మాట్లాడుతూ రాష్ట్రంలో జాబు రావాలంటే బాబు రావాలని పేర్కొన్నారు.


ప్రతి ఒక్కరూ తమ జీవితాలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారి పాలన రావాలని తెలియజేశారు. మోసపూరిత వాగ్దానాలతో రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలకు నెట్టేస్తారని రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చిన కంపెనీలన్నీ భయాందోళన సృష్టించి రాకుండా చేసి నిరుద్యోగుల సమస్య ఎక్కువ అయ్యే విధంగా ఈ ముఖ్యమంత్రి దోహదపడ్డారని పరిశ్రమల రాక చదువుకున్న వారికి సరైన ఉపాధి లేక నిరుద్యోగులు తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నారని రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు శశిభూషణ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఉపాధ్యక్షులు సాంబమూర్తి, పట్టణ అధ్యక్షులు నాగరాజు కార్యదర్శి నవీన్, పలాస మండల అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, సంతోష్, లబ్బ రుద్రయ్య, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు నవీన్, అప్పారావు, సూర్యనారాయణ, తెలుగుయువత మండల అధ్యక్ష కార్యదర్శులు హరికృష్ణ, శ్రీను, దుర్యోధన, ధనుంజయ, శంకర్, జోగ మల్లి, ఆకర్ష, తారకరత్న, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa