మన దేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం సేవలు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచాయని నరసన్నపేట మండల విద్యాశాఖ అధికారి ఉప్పాడ శాంతారావు అన్నారు. బుధవారం నరసన్నపేట దేశవానిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అబ్దుల్ కలాం ఏడవ వర్ధంతి పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడో రామేశ్వరంలో డైలీ పేపర్లు వేసుకుంటూ జీవించే ఓ పిల్లాడు. రోజురోజుకూ ఎదుగుతూ. దేశం గర్వించదగ్గ సైంటిస్టుగా మారడం అనేది ఊహించుకుంటేనే ప్రేరణ కలిగించే అంశం అని అన్నారు.
రాకెట్ల తయారీలో తలమునకలై పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను కూడా మర్చిపోయిన గొప్ప శాస్త్రవేత్త ఆయన అని అన్నారు. అందుకే దేశం ఆయన్ని మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా గా కీర్తించిందని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లు రియల్ లైఫ్లో చాలా అరుదు గా ఉంటారని ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా పార్టీలు ఎంపిక చేసినప్పుడు చాలా మంది వద్దు అన్నారని గుర్తు చేశారు. దీనికి కారణం ఆయన ఆ పదవికి పనికిరారు అని కాదు. ఆయన రాష్ట్రపతిగా కంటే. సైంటిస్టుగా దేశానికి ఆయన అవసరం ఎక్కువ అని ఆనాడు భావించారని తెలిపారు. కానీ ఆ పదవి అలంకరించిన తర్వాత అబ్దుల్ కలాం దానికి వన్నె తెచ్చారు. రబ్బర్ స్టాంప్ అన్న మాటను మర్చిపోయేలా చేశారు. దేశమంతా తిరిగారు. విద్యార్థులతో మాట్లాడారు. చైతన్యపూరిత ప్రసంగాలు చేశారు. ప్రతి మాటా ఉత్సాహం నింపేది. ఆయన జీవితాన్ని తెలిపే వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం లోనూ ఎన్నో ప్రేరణాత్మక ఘట్టాలున్నాయని తెలియజేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa