ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 02:44 PM

విజయవాడ ఈస్ట్ జోన్ పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన డిప్యుటీ పోలీస్ కమీషనర్ శ్రీ విశాల్ గున్ని ఐ.పి.యస్. ది.27.07.2022న ఎన్.టి.ఆర్ జిల్లా, పోలీస్ కమీషనర్ వారి కార్యా లయంలో ఈస్ట్ జోన్ పరిధిలోని సెంట్రల్ మరియు సౌత్ డివిజన్ల అసిఫ్రెంట్ పోలీస్ కమీషనర్లు ఇనస్పెక్టర్లు, మరియు ఎస్.ఐ.లతో డిప్యుటీ పోలీస్ కమీషనర్ శ్రీ విశాల్ గున్ని ఐ.పి.యస్.. నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. 


ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డిప్యుటీ పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ...... నగర పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ వాటి సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుధారులపట్ల రిసెప్షన్ లలో వున్నవారు మర్యాదగా వ్యవహరించాలి. సిబ్బంది అందరు తమ విధులలో మెరుగైన పనితీరు చూపించాలని ఆదేశించారు.


మహిళా సంబంధిత కేసులలో ఎటువంటి అలసత్వం లేకుండా దర్యాప్తు చేయాలని మరియు ఎక్కడా మహిళలపై ఈవ్ టీజింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయిసేవించే మరియు అమ్మేవారిపై ప్రత్యేక నిఘా పెంచాలని ఆదేశించారు. 


క్రమం తప్పకుండా ఫుట్ పెట్రోల్లింగ్ నిర్వహించి అనుమానిత వ్యక్తులపై నిఘా ఏర్పాటు చెయ్యాలని తెలిపారు.  ఈ సమావేశంలో సౌత్ ఏ.సి.పి. డా.బి.రవి కిరణ్ , దిశా ఏ.సి.పి. శ్రీ వి.వి.నాయుడు , సి.సి.ఆర్.బి.ఏ.సి.పి. శ్రీ కె.వెంకటేశ్వర రావు , ఈస్ట్ జోన్‌లోని ఇన స్పెక్టర్లు మరియు ఎస్.ఐ.లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa