టీడీపీ పాలనలో ప్రజలు డబ్బులు మిగిల్చుకొని జీవించేవారని, అదే వైసీపీ పాలనలో వచ్చేసరికి లోటు బడ్జెట్ తో కాలం వెలదీయాల్సి వస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రూ.15 వేలు సంపాదించుకునే పేద, మధ్య తరగతి కుటుంబాలకు.. టీడీపీ పాలనలో నెలకు రూ.4 వేలు మిగులు ఉండేదని.. ఈ పాలనలో మాత్రం రూ.9 వేలు లోటు ఉంటోందన్నారు. నెలకు రూ.9 వేల చొప్పున ఏటా రూ.1 లక్షా 8 వేలు ఒక్కో కుటుంబం నుంచి వైఎస్సార్సీపీ కుటుంబం దోచుకుంటుందని ఆరోపించారు. 2019 వరకు నెలకు రూ.11 వేల రూపాయలు ఖర్చులకు సరిపోతే.. ఇప్పుడు రూ.20 వేలు అవుతోందన్నారు.
ముఖ్యమంత్రి జగన్ దోపిడీని దశలవారీగా బయటపెడతానని ఆయన పేర్కొన్నారు . గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. మంగళగిరి పట్టణం 22వ వార్డు రత్నాల చెరువు ప్రాంతంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. దొంగే దొంగా.. దొంగా అనే రీతిలో మొదటి నుంచి వైఎస్ జగన్ వ్యవహారం ఉందన్నారు. మీడియాపై ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్ అంటున్న జగన్.. క్లీన్ బౌల్డ్, లేని పక్షంలో స్టంప్ అవుట్ కాక తప్పదన్నారు. జగన్ కళ్ళు మూసుకుని ఆడే ఫ్రంట్ ఫుట్ తో బొక్కబోర్లా పడక తప్పదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వరద ప్రాంతాల్లో జగన్ పర్యటన బూటకమని.. తాము వేసిన సిమెంట్ రోడ్డుపైనే జగన్ తిరిగారని చెప్పుకొచ్చారు. వెనుక కార్లు కూడా వెళ్తుంటే ముందు ట్రాక్టరుపై జగన్ వెళ్లాల్సిన పనేముందని సెటైర్లు పేల్చారు. పోలవరం విలీన మండలాల్లో వాస్తవాలను చంద్రబాబు బయటపెడతారని.. విలీన ప్రాంతాల ప్రజలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో చేనేత రంగం పట్ల ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు లోకేష్. మంగళగిరిలో చేనేతల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని.. వర్షాకాలం మగ్గాల్లో నీరు చేరి ఉపాధి కోల్పోతున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
బాదుడే బాదడు కార్యక్రమంలో.. స్థానిక ప్రజలతో మాట్లాడారు. పోలియోతో బాధపడుతున్న తన మూడో కూతురుకు వీల్ చైర్ అందించాలని రాజేశ్వరి అనే దివ్యాంగురాలి కుటుంబం లోకేశ్ కోరింది. దీనికి అంగీకరించిన లోకేశ్.. వీల్ చైర్ అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ బాదుడే బాదుడు కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ప్రజలతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa