తిమ్మాయపాలెం పంచాయతీ కొత్తపల్లి హరిజనవాడలో గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గ్రామ దేవతకు పొంగుబాలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసీపీ మండల సీనియర్ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి, సర్పంచ్ బాలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ, ఎంపీపీ చంద్ర, వైస్ ఎంపీపీ సుబ్రహ్మణ్య రెడ్డి, మైలపల్లి మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, పెంచలయ్య హాజరయ్యారు. కొత్తపల్లి హరిజనవాడలో ముందుండి కార్యక్రమాలు నిర్వహించిన కుప్పల సాలయ్య, కొప్పల వెంకటస్వామి, నరసింహులు, మనీ, జయన్న, సుబ్బ నరసయ్య, శివ, హరి, అనిల్ తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa