ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ గెలిచే పరిస్థితి లేదని ఆ పార్టీ వారే చెబుతున్నారు: అచ్చెన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 03, 2022, 05:21 PM

వైసీపీ గెలిచే పరిస్థితి లేదని సొంత పార్టీవాళ్లే చెబుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో పాటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కొంతమంది చేసిన ట్వీట్‌లను ప్రస్తావించారు. వైఎస్సార్‌సీపీ గెలిచే పరిస్థితి లేదని సొంత పార్టీవాళ్లే చెబుతున్నారని ఎద్దేవా చేశారు.


‘గత మూడేళ్లలో దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, కల్తీ మద్యం, ప్రతిపక్షాల నాయకులు కార్యకర్తలపై దాడులు, భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా, శ్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు, పూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి, లక్షల కోట్లలో ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు, అధికార పార్టీ నేతల ఆగడాలు చూసి చూసి, సామాన్య ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఏపీకి సీఎం కావాలి అని. కానీ కేవలం మూడంటే మూడేళ్ళలో సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కూడా జగన్ రెడ్డి నైజం, అతని అసమర్థ పాలన గురించి అర్థమైపోయింది. బహిరంగంగా తమ అసంతృప్తి వెళ్లగక్కడమే కాదు, ఈసారి తమ పార్టీ గెలిచే పరిస్థితి లేనే లేదని వారే స్వయంగా చెబుతున్నారు’అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు. కొన్ని స్క్రీన్ షాట్‌లను కూడా పొందరుపరిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa