ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓఎన్డీసీకి భారీ జరిమాన విధించిన ఎన్జీటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 03, 2022, 05:22 PM

కాలుష్యానికి కారణమవుతున్న ఓఎన్డీసీపై ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అంతేకాదు సదరు సంస్థపై భారీ జరిమానాను ఎన్జీటీ విధించింది. వివరాలలోకి వెళ్లితే...ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ (ఓఎన్డీసీ)కు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెన్నై ధర్మాసనం భారీ జరిమానా విధించింది. కోనసీమ జిల్లాలో భూ, జల కాలుష్యానికి ఓఎన్జీసీ, గెయిల్‌ సంస్థలు కారణమని నిర్ధారణకు వచ్చిన ఎన్జీటీ.. రూ.22,72,61,000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ మొత్తాన్ని ఆరు నెలల్లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద జమ చేయాలని ఈ మేరకు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సభ్య నిపుణుడు సైబల్‌ దాస్‌గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.


కోనసీమలో ఓఎన్జీసీ, గెయిల్‌ గ్యాస్ నిక్షేపాల అన్వేషణల కారణంగా జల కాలుష్యం ఏర్పడుతోందని ఆరోపిస్తూ 2020లో మలికిపురం ప్రాంతానికి చెందిన పర్యావరణవేత్త యెనుముల వెంకటపతిరాజు ఎన్జీటీలో (ఎన్జీటీ) ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ.. అధ్యయనానికి ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులు కోనసీమలో పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదికను ఎన్జీటీకి సమర్పించారు. కమిటీ నివేదికను పరిశీలించిన ఎన్జీటీ చెన్నై బెంచ్.. ఓఎన్జీసీ, గెయిల్‌లు ఉల్లంఘనలకు పాల్పడినట్టు నిర్ధారించింది.


ఈ నేపథ్యంలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడిన ఆ సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. అలాగే, ఓఎన్జీసీకి రూ.22.72 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించిది. ఈ నిధులను కోనసీమ ప్రాంతంలోనే ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులకు స్పష్టం చేసింది. ఆయా సంస్థల కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లోనే సీఎస్ఆర్ నిధులను ఖర్చు చేయాలని ఎన్జీటీ పేర్కొంది. అలాగే, ఈ నిధుల వినియోగంపై పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యవేక్షించాలని, కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శకాలను పాటించాలని ఓఎన్‌జీసీకి తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa