గోదావరి ఎట్టకారం ప్రదర్శించడంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సిద్ద హస్తులు. ఇదిలావుంటే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్లో బాగా యాక్టివ్ అయ్యారు. కొద్దిరోజులుగా జగన్ సర్కార్ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ గోదావరి వెటకారం కాస్త జోడిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, వైఎస్సార్సీపీ నేతలు ముఖ్యమంత్రి జగన్పై చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ సెటైర్లు పేల్చారు.
‘మనసున్న నేత సీఎం జగన్ - వైసిపి నాయకులు. అవును.. మన'సున్నా'నేత ఆంధ్రప్రదేశ్ ప్రగతి కి 'సున్నం' పూసిన మనసున్న నాయకుడు @ ప్రజలు’అంటూ ఎద్దేవా చేశారు. #గోరంట్ల, #FailedCMjagan,#ZeroGrowthCMjagan అంటూ టార్గెట్ చేశారు. మనసున్నా అంటూ ఎమ్మెల్యే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై మరో ట్వీట్ చేశారు. ‘మహాప్రభో..అది రోడ్డా..లేక నీటి కుంటల.. మీరు 'బటన్లు' నొక్కడం ఏమో కాని జనాల టైర్ల 'బటన్లు' పోతున్నాయి ముఖ్యమంత్రి జగన్ గారు. ఒళ్ళు హూనం అయ్యిపోతున్నాయి’అంటూ ఎద్దేవా చేశారు. గుంతల రోడ్లపై వెళ్లిన కారు పరిస్థితి ఇలా ఉందంటూ కొన్ని ఫోటోలను కూడా ట్వీట్కు జతపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa