రాష్ట్రంలో అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆదుకోవడానికి రైతు భరోసా యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నిడదవోలు మండలం పెండ్యాల గ్రామ జనసేన పార్టీ ఎంపీటీసీ వాకా ఇంద్రా గౌడ్ ఆధ్వర్యంలో ఇటీవల గోదావరి వరదల కారణంగా పంటలు నష్టపోయిన కౌలు రైతులను గుర్తించి పెండ్యాల పరిధిలోని 55 మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి 25 కేజీల చొప్పున బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు నియోజకవర్గ ఇన్చార్జ్ విడివాడ రామచంద్రరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నిడదవోలు నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిటిసి వాకా ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే జనసేన అని, ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన నిడదవోలు నియోజకవర్గ జనసేన నాయకులకు జనసైనికులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa