ఉరి వేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానిక సుసర్లకాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాపీమేస్త్రిగా పనిచేస్తున్న నకరపు మురళీకృష్ణ, భార్య దమయంతి (29), ఇద్దరు పిల్లలతో సుసర్లకాలనీలో నివసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం మురళీకృష్ణ పని కోసం పరవాడ వెళ్లాడు. కుమార్తె తొమ్మిదేళ్ల దీక్షిత పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వచ్చింది. తలుపులు ఎంత కొట్టినా తల్లి తీయకపోవడంతో పక్కింటి వారికి చెప్పింది. దీంతో స్థానికులు వచ్చి కిటికీ అద్దాలు పగులగొట్టి చూడగా దమయంతి ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని వుండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు.
దీంతో వారు ఘటనా స్థలికి చేరుకుని మృతురాలి భర్త మురళీకృష్ణకు ఫోన్ చేయగా ఆయన అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కాగా మురళీకృష్ణ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి చేరుకుని భార్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలుసుకుని కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నాడు. తమకు ఎటువంటి కుటుంబ కలహాలు లేవని, అయినా తన భార్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa