ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వాతంత్ర సమర యోధుల్ని స్మరించుకుందాం ప్రభుత్వరంగసంస్థ లను కాపాడుకుందాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 13, 2022, 03:54 PM

అజాది కా అమృతోత్సవ వేడుకలలో భాగంగా వైఎస్సార్ టీయూసీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ టీయూసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి వై మస్తానప్ప మాట్లాడుతూ ఎన్నో త్యాగాల, ఉద్యమ, పోరాటాల ద్వారా స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొన్నామని, స్వాతంత్ర్యం కోసం మన పూర్వీకులు చేసిన త్యాగాలను 75 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడు పై ఉందని, అదేవిధంగా దేశ ఆర్ధిక మూలాలైన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వై మస్తానప్ప, కర్రి దాలినాయుడు, ఎన్నేటి రమణ, పిట్టరెడ్డి, ద్వారపూడి బ్రహ్మం, దాసరి పుల్లారావు, యస్ మురళి, బిసాయి, వంకర వరప్రసాద్, తానేటి చంద్రశేఖర్, సురేశ్వరరావు, పాలకీర్తి బ్రహ్మయ్య, చంద్రశేఖర్ శకునాల, సూర్య రావు, గెద్దాడ నాగరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa