ఏపీలో రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ నాగబాబు అన్నట్లుగా ట్విట్ల వార్ కొనసాగుతోంది. దీంతో ఏపీ రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు ముందు సెటైర్లు పేలిస్తే.. మెగా బ్రదర్ నాగబాబు, జనసేన నేతలు కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇస్తున్నారు. ఇరువురి మధ్య పెద్ద ట్వీట్ వార్ నడుస్తోంది. తాజాగా నాగబాబు తనపై చేసిన ట్వీట్కు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.
‘భలే ఓరండి నాగబాబు గారు.. ఎంత ఓపిగ్గా, ఎంత తీరిగ్గా.. నా బొమ్మేసారండి. ఖాళీగా ఉన్నట్లున్నారు.. ధన్యవాదాలు’అంటూ నాగబాబును ట్యాగ్ చేశారు. మంత్రి చేసిన ట్వీట్పై జనసైనికులు స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. ఆయన ఖాళీగా తీరిగ్గా ఉన్న ప్రజలకు వచ్చిన నష్టం ఏమి లేదని.. ప్రజలు 'మీకు' ఒక పదవి ఇచ్చారు.. పైగా మంత్రి కూడా.. ముందు పోలవరం ప్రాజెక్ట్ పనులు చూడాలంటూ చురకలంటించారు. ఖాళీగా కూర్చోని పవన్ కళ్యాణ్పై ట్వీట్స్ వేయడం కాదు అన్నారు.
ముందు మంత్రి అంబటి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘కాటన్ దుస్తుల ఛాలెంజ్లు ఆపి.. 175 సీట్లకి పోటీ చేస్తున్నారా! లేదా? ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించండి!’అంటూ సెటైర్లు పేల్చారు. ఈ ట్వీట్కు వెంటనే మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఎన్నిసార్లు చెప్పాలి.. ఎవరూ అంత ఖాళీగా లేరంటూ సెటైర్లు పేల్చారు.
నాగబాబు తన ట్వీట్లో ‘ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా!.. బాబూ.. ఓ రాంబాబు.. జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కి, వైసీపీ సర్కస్ లో నీలాంటి బఫూన్ గాళ్ళు అడిగే క్లారిఫికేషన్స్ కి సమాధానం చెప్పే ఓపిక, తీరిక మా జనసైనికులకి లేదు. మా ప్రెసిడెంట్ గారికి అంతకంటే లేదు’అన్నారు.
దీంతో ఇద్దరి మధ్య ట్వీట్ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది. మరి మంత్రి అంబటి రాంబాబు ట్వీట్కు నాగబాబు ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa