అంతా అనుకున్నట్టే విడుదలకు సిద్ధమౌతున్న తరుణంలో వాల్మీకి చిత్రం పేరు మార్చుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ బేనర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘వాల్మీకి’. ఆది నుంచి వివాదాలకు చోటిచ్చింది. అయితే బోయ సామాజికవర్గంతో పాటు పలువురు రాజకీయనేతలు అభ్యంతరం తెలిపారు. వాల్మీకి సినిమాకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లోని వాల్మీకి సంఘాలు కొన్ని రోజలుగా ఆందోళన చేస్తున్నాయి. టైటిల్ను మార్చాలని లేకుంటే థియేటర్ల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించాయి. అంతేకాదు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య సైతం సినిమా పేరును మార్చాలని డిమాండ్ చేశారు. దీనికి తోడు వాల్మీకి సంఘాల ఆందోళనపై స్పందించిన కర్నూల్, అనంతపురం జిల్లాలలతో సహా పలు జిల్లాల కలెక్టర్లు వాల్మీకి చిత్రాన్నిప్రదర్శించవద్దని థియేటర్ యాజమాన్యాలను కలెక్టర్లు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వాల్మీకి టైటిల్ మార్పాలంటూ బోయహక్కుల పోరాటసమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం..హైకోర్టు నుంచి మూవీ మేకర్స్ కు నోటీసులు ఇవ్వడంతో ఇప్పటి వరకు టైటిల్ మార్చేది లేదని తెలిపిన చిత్రయూనిట్.. ఈ నోటీసులకు కోర్టుకు వివరణ ఇస్తూ చిత్ర టైటిల్ను మారుస్తున్నట్లుగా తెలిపారు ఈ మేరకు గురువారం రాత్రి దర్శక నిర్మాతలు ఓ ప్రకటన విడుదలచేస్తూ ''వాల్మీకి'' పేరును ''గద్దలకొండ గణేశ్''గా మారుస్తున్నట్టు ప్రకటించారు. దీంతో సెప్టెంబర్ 20న ఈ చిత్రం ‘గద్దలకొండ గణేష్’ టైటిల్తోనే విడుదల కాబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa